TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రైతులను దొంగలంటారా? టీడీపీని తప్పుబట్టిన బీజేపీ

Published on: Tue Oct 6, 2015 1:39PM

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారంతా దొంగ రైతులంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది, రైతులను దొంగలతో పోల్చడం సరికాదన్న బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి... అన్నదాతలను అవమానించేలా మాట్లాడొద్దని సూచించారు, కళావెంకట్రావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్న ఆయన.... విమానాశ్రయాల కోసం అంత పెద్దఎత్తున భూములు తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు, చెన్నై ఎయిర్ పోర్ట్ కేవలం 1400 ఎకరాల్లోనే ఉందని, మరి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇన్ని వేల ఎకరాలు భోగాపురంలో ఎందుకంటూ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు.