భీమవరం బుల్లోడు ఆడియో ఫంక్షన్‌లో అపశృతి

 

సునీల్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో తెరకెక్కుతున్న భీమవరం బుల్లొడు ఆడియో ఫంక్షన్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఫంక్షన్‌లో తొక్కిసలాట జరగటంతో సురేష్‌ అనే యువకుడు మరణించాడు. పశ్చివ గోదావరి జిల్లా భీమవరంలో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని స్థానిక డిఎన్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేశారు.

అయితే ఊహించిన దానికన్నా అభిమానులు ఎక్కువగా రావటంతో చేసిన ఏర్పాట్లు సరిపోక తొక్కిసలాట జరిగింది. వెనుక వరనుసలో కూర్చున్న వారు ముందు వారిని తోసేయటంతో సురేష్‌ కిందపడిపోయాడు తరువాత జరిగిన తొక్కిసలాటలో సురేష్‌ మృతి చెందాడు.