అప్పుడే కొత్త పాలకులను నియమించవద్దు... బీసీసీఐ

 

బీసీసీఐ పాలకుల నియామకం విషయంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీసీసీఐ ఇప్పుడే కొత్త పాల‌కుల‌ను నియ‌మించ‌వ‌ద్ద‌ని సుప్రీంకోర్టును కోరారు. కోర్టు నియ‌మించిన అనిల్ దివాన్‌, గోపాల్ సుబ్ర‌మ‌ణియ‌న్‌లు 9 మంది పేర్ల‌ను బీసీసీఐ పాల‌కుల కోసం ప్ర‌తిపాదించింది. అయితే తొమ్మిది మంది చాలా ఎక్కువ‌ని అభిప్రాయ‌ప‌డిన కోర్టు.. ఇవాళ ఆ పాల‌కుల పేర్ల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పింది. అయితే దీనిపై అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గీ అప్పుడే కొత్తపాలకులను నియమించవద్దని.. ఈ నిర్ణయాన్ని క‌నీసం రెండు వారాలు వాయిదా వేయాల్సిందిగా అభ్య‌ర్థించారు. అటు బోర్డు అడ్మినిస్ట్రేష‌న్ కోసం తాము కూడా కొన్ని పేర్ల‌ను ప్ర‌తిపాదిస్తామ‌ని తెలిపింది. దీనికి గాను కోర్టు కొన్ని పేర్లను సీల్డ్ క‌వ‌ర్‌లో అందించాల‌ని బోర్డు త‌ర‌ఫు న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్‌ను కోర్టు ఆదేశించింది.