పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లు కూలిన రెండు గంటల్లో దారుస్సలాం ను కూల్చేస్తాం... అక్బరుద్దీన్ కు సంజయ్ స్

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ లపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈరోజు అక్బరుద్దీన్ మాట్లాడుతూ హుస్సేన్ సాగర్ పై ఉన్న ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ, "హుస్సేన్ సాగర్‌పై ఉన్న పీవీ సమాధిని, ఎన్టీఆర్ సమాధిని కూల్చే దమ్ము నీకుందా? అవి నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా. పీవీ, ఎన్టీఆర్ ల సమాధులను కూల్చిన రెండుగంటల్లోనే నీ దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారు" అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి ఓట్లు పొందాలని టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు చూస్తున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు చేవచచ్చి ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం నాయకులు చేసే సవాల్‌ను స్వీకరించలేని దౌర్భాగ్య పరిస్థితిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని సంజయ్ అన్నారు. హిందువులు అందరూ ఓటు బ్యాంకుగా మారితేనే హైదరాబాద్‌లో బీజేపీ గెలుస్తుందన్నారు.