ఒవైసీ దీపం వెలిగించు! నీకు జ్ఞానం వస్తుంది!
posted on Apr 4, 2020 3:05PM
ఒవైసీ దీపం వెలిగించి చూడు దాని పవర్, వెలుగుతో పాటు నీకు జ్ఞానం వస్తుంది. ఆదివారం రాత్రి నీ దారుసలేంపైకి వెళ్లి చూడు ప్రజల స్పందన నీకు కనువిందు చేస్తాదంటూ బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు, ఎం.పి. బండి సంజయ్ ఒవైసీపై ఘాటుగా విమర్శలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ దీపం వెలిగించమంటే మతమౌఢ్యంతో చూడటం ఒవైసీ అవివేకనికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రధాని ఇచ్చిన ఐక్యత కార్యక్రమాన్ని విమర్శించడం దారుణమని ఆయన మండిపడ్డారు. నువ్వు ఆపితే ఆగే కార్యక్రమం కాదది, గుర్తుంచుకో ఒవైసీ అంటూ సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మతమౌఢ్యం తలకెక్కిన ఉన్మాది ఒవైసీ అని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లపై భౌతిక దాడులు, బూతులు తిట్టడం, ఉమ్మివేయడం వంటి ముర్కాపు చర్యల్ని ఎందుకు ఒవైసీ ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు.
వైద్యులకు కృతజ్ఞత తెలుపకుండా ఒవైసీ ముర్కుడిలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఒవైసీకి దమ్ముంటే డాక్టర్లపై, నర్సులు, పోలీసులు, ఆశావర్కర్లలపై దాడులను అడ్డుకోవాలని ఆయన సూచించారు.