TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాకు రెండు రోజుల సమయం కావాలి...సిట్‌కు బండి భగీరథ్ లేఖ

Published on: Wed May 13, 2026 6:29PM

 

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తు నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో సంబంధిత వ్యక్తి అయిన బండి భగీరథ, పోలీసులకు ఈమెయిల్‌ ద్వారా అధికారిక లేఖ పంపించి తన హాజరు విషయంపై స్పష్టత ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు మరియు కీలక ఆధారాల సేకరణ కారణంగా మే 15న విచారణకు హాజరవుతానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన లేఖలో స్పష్టంగా తెలియజేశారు.

పోలీసులకు పంపిన లేఖలో బండి భగీరథ కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. విచారణకు ఆలస్యంగా హాజరు కావడం వెనుక ఉద్దేశ్యం కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను సేకరించడమేనని తెలిపారు. తాను విచారణకు హాజరవు తున్నప్పుడు సంబంధిత ఆధారాలను సమర్పిస్తానని పేర్కొన్నారు.అలాగే కేసు దర్యాప్తులో పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, న్యాయ ప్రక్రియను గౌరవిస్తున్నానని తన లేఖలో పేర్కొన్నారు.

ఈ కేసును పరిశీలిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని బండి భగీరథ తెలిపారు. విచారణకు హాజరవుతున్నప్పుడు తాను సమర్పించబోయే ఆధారాలు కేసు దర్యాప్తుకు ఉపయోగపడతా యని ఆయన అభిప్రాయపడ్డారు.కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అధికారులు బండి భగీరథ లేఖను స్వీకరించినట్లు సమాచారం. మే 15న ఆయన విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో తదుపరి విచారణ ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి, మే 15న జరగనున్న విచారణలో ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.