TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక‌టి ఒక‌టి ఒక‌టి అంటే వాచిపోద్ది.. టెన్త్ ఫలితాలపై విద్యాసంస్థల ప్రచారంపై బ్యాన్ .. నారాయణా

Published on: Fri Jun 3, 2022 6:51AM

పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక ఏ విద్యాసంస్థలూ మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి. టెన్ ఆఫ్ టెన్ ఇంత మందికి వచ్చింది, అంత మందికి వచ్చింది అంటూ ప్రకటనలు ఇవ్వడం, ఫలితాలపై   ప్రచారం చేసుకోవడం,  నిషిద్ధమని, ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌   ఉత్తర్వులు జారీ చేశారు.  విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. టెన్త్ పరీక్షల ఫలితాల విడుదలలో గతంలో గ్రేడింగ్‌ విధానం ఉండేదని, 2020 మార్చి నుంచి మార్కులు ప్రకటించే విధానాన్ని పున:ప్రారంభించామని తెలిపారు. 

ఈ నేపథ్యంలో విద్యార్థులకు అత్యధిక మార్కులు రావడానికి తమ విద్యాసంస్థలే కారణమని విద్యా సంస్థలు, ట్యుటోరియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రచారం చేసుకోవడానికి అనుమతి లేదన్నారు.అలాంటి ప్రచారం వల్ల విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పడుతోందనీ, దాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు

. ఫలితాలను తమకనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వ పరీక్షల చట్టం 7ఏ ప్రకారం వీలు లేదన్నారు. ఎవరైనా ఉల్లంఘించి ప్రచారం చేసుకున్న, ప్రకటనలు విడుదల చేసినా  లక్ష జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  కాగా నారాయణ విద్యాసంస్థలను దృష్టిలో ఉంచుకునే ఈ నిషేధం ఉత్తర్వులు జారీ చేశారని పరిశీలకలు అంటున్నారు. మాజీ మంత్రి నారాయణపై ఇటీవలి కేసులు, అరెస్టులతో చెలరేగిపోయిన సర్కార్ కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యలో ఇప్పుడిలా విద్యాసంస్థల ప్రకటనలపై నిషేధం విధించిందని పేర్కొంటున్నారు.