బళ్లారిలో మళ్లీ మైనింగ్ కి సుప్రీం గ్రీన్ సిగ్నల్
Published on: Mon Sep 3, 2012 1:42PM
బళ్లారిలో ఎ కేటగిరీలో ఉన్న 18 మైనింగ్ కంపెనీల్లో తవ్వకాలపై నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తేసింది. అటవీశాఖ, మైనింగ్ శాఖ అనుమతులతో మాత్రమే తవ్వకాలు జరుపుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. చాలాకాలంగా తవ్వకాలు ఆగిపోవడంవల్ల కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతోందని, ఉద్యోగులకు జీతాలిచ్చేపరిస్థితికూడా లేనందున వెంటనే తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మైనింగ్ కంపెనీలు చేసుకున్న విన్నపాన్ని మన్నించిన సుప్రీంకోర్టు మైనింగ్ జరుపుకోవడానికి అనుమతిచ్చింది.


