బాగ్దాద్‌పై మళ్లీ ఉగ్రపంజా..30 మంది మృతి

గత ఆదివారం రద్దీగా ఉన్న మార్కెట్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన వరుస బాంబు పేలుళ్లతో 180 మంది అమాయక ప్రజలు మరణించిన సంఘటన మరచిపోకముందే ముష్కరులు మరోసారి బాగ్దాద్‌ నగరంపై పంజా విసిరారు. నగర ఉత్తర ప్రాంతంలోని బొలాడ్‌లోని షీతే ప్రార్థనా మందిరం వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడి..ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందగా..50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.