‘గాలి’కి బెయిలు... అయినా జైల్లోనే....

 

 

ఏఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లోఉన్న కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డికి ఎట్టకేలకు బెంగుళూరు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఏఎంసీ) కేసు విషయంలో బెంగుళూరు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ ఫర్ స్కామ్‌లో మాత్రం ప్రస్తుతం జనార్థన్‌రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఓఎంసీ కేసులో ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. ఏఎంసీ కేసులో బెయిల్ వచ్చినంత మాత్రన ఇప్పటికిప్పుడు జైల్ నుంచి విడుదల అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఓఎంసీ కేసుకు సంబంధించి గాలికి బెయిల్ రావాలసి ఉంది. దీనిపై సుప్రీం కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ప్రస్తుతం గాలి జనార్థన్‌రెడ్డి బెంగుళూరు జైల్లో ఉన్నారు.