TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉగ్రవాదుల పైశాచికం.. 60 మంది మృతి

Published on: Thu Aug 13, 2015 1:24PM

 

ఇకార్ రాజధాని బాగ్దాద్ నగరంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ట్రంక్ బాంబ్ పెట్టి పలువురు ప్రాణాలను బలిగొన్నారు. ఇకార్ రాజధాని బాగ్దాద్ నగరంలో సరద్ ప్రాంతంలోని మార్కెట్ లో ఉదయం పూట నిత్యం రద్దిగా ఉంటుంది. ఇదే అదనుగా చూసుకొని ఉగ్రవాదులు ఒక ట్రక్ బాంబ్ తీసుకొని వచ్చి అక్కడ పార్క చేశారు. ఈ ట్రక్ ఒక్కసారిగా పేలి ఈ దాడిలో 60 మంది మరణించగా దాదాపు 200 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. కొంతమంది శరీరాల నుండి అవయవాలు తెగి గాలిలో ఎగిరిపడ్డాయి. కొంత మంది అమాయకుల కాళ్లు, చేతులు తెగిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తలించారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు బాంబు దాడికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.