బిజినస్ అడ్వయిజరీ కమిటీ కుదరని ఏకాభిప్రాయం

 

ఊహించినట్లుగానే కొద్ది సేపటి క్రితమే ముగిసిన శాసనమండలి-బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో తెలంగాణా బిల్లుపై సభలో ఎప్పటి నుండి చర్చ చెప్పట్టాలనే అన్శామపి సభ్యులమధ్య అంగీకారం కుదరలేదు. అందువల్ల శాసనసభలో బిల్లుపై ఏ సమయంలో చర్చ జరిగితే అదే సమయంలో శాసనమండలి కూడా చర్చించాలని నిర్ణయించడంతో సమావేశం ముగిసింది. ఈ సమావేశం ముగియగానే, శాసన సభ-బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం మొదలయింది. బహుశః ఇందులో కూడా ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యుల సంఖ్యా సరి సమానంగా ఉంది గనుక సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం అసంభవమే. కనుక, ఈ సమావేశంలో కూడా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండానే ముగిసే అవకాశం ఉంది. ఈ వారంతో ముగియనున్న శాసనసభ శీతాకాల సమావేశాల తరువాత మళ్ళీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లుపై చర్చ చెప్పట్టాలని కమిటీలలో సీమాంధ్ర సభ్యులు గట్టిగా వాదిస్తున్నట్లు సమాచారం. ఏమయినప్పటికీ, మరి కొద్దిసేపటిలో ఆ సంగతీ తేలిపోతుంది.