అటు చంద్రబాబు..ఇటు లోకేష్...

 

 

 

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఓకే రోజు తమ కార్యాలయాలో అధికారంగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో పూజలు నిర్వహించి అధికారంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విశాఖలో జరిగిన తొలి క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలపై బాబు తొలి సంతకం చేశారు. మరోవైపు ఆయన తనయుడు నారా లోకేష్ టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు. కార్యకర్తల నిధికి రూ.14 కోట్ల విరాళం వచ్చిందని, పార్టీ నుంచి రూ.6 కోట్లు కేటాయించి రూ.20 కోట్ల నిధి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. సంక్షేమ నిధి వరకే తన బాధ్యత అని మిగిలిన పార్టీ వ్యవహారాలు సీఎం చంద్రబాబే చూసుకుంటారని లోకేష్ చెప్పారు. ప్రతిరోజు ఓపెన్ హౌస్ పేరుతో ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యకర్తలను కలుసుకుంటామని ఆయన తెలియజేశారు.