తెలంగాణకు సాయం కోరిన చ౦ద్రబాబు

 

గురువారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస భేటిలతో బిజీబిజీగా గడుపుతున్నారు. విద్యుత్ సమస్యపైన విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో చర్చించిన తరువాత బాబు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విద్యుత్ సమస్యలను తీర్చాలని మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. ఎపిలో ఐదువందల మెగావాట్ల విద్యుత్ అదనంగా ఉత్పత్తి అవుతుందని ఆయన చెప్పారు. వచ్చే ఐదేళ్లలో విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపడతామని తెలిపారు. విభజన తరువాత రెండు రాష్ట్రాల్లో సమస్యలున్నాయని, 24/7 సిస్టంతో 24గంటల పాటు గృహాలకు, పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వాలని, అలాగే రైతులకు క్వాలిటీతో కూడిన విద్యుత్ ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. విద్యుత్ విషయంలో తెలంగాణకు కూడా సాయం చేయాలని కోరామని బాబు అన్నారు.