TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాబు గొప్ప విజనరీ.. అమరావతి నగరం కాదు దేవతల రాజధాని.. బాబా రామ్ దేవ్

Published on: Sat Jun 20, 2026 11:33AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబును దేశంలోనే  గొప్ప విజన్ ఉన్న ఉత్తమ నాయకుడిగా అభివర్ణించారు.  

గత నాలుగు దశాబ్దాలుగా  చంద్రబాబు నాయుడు ఈ దేశం కోసం,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం కోసం ఏది అడిగితే   అది తాను చేస్తూనే ఉన్నామన్న బాబా రాందేవ్..  చంద్రబాబు సమాజంలోని అందరినీ సమానంగా చూసే ఒక గొప్ప లీడర్ అని, అందుకే ఇక్కడి ప్రజలు ఆయన్ని ఎంతో గౌరవిస్తూ, దేవుడిలా భావిస్తారన్నారు.  

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదనీ..  అది సాక్షాత్తూ దేవతల రాజధాని రామ్ దేవ్ అమరాతిని  పవిత్రమైన దేవ భూమిగా అభివర్ణించారు.   అమరావతి నగర ప్రణాళికలో నలభై శాతం పచ్చదనం అంటే గ్రీనరీకి మరియు అరవై శాతం కాంక్రీట్ నిర్మాణాలకు ప్రాధాన్యత ఉంటుందన్నఆయన ఈ  సమతుల్యత  భవిష్యత్తులో ప్రకృతి అందాలను, స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రజలు స్విట్జర్లాండ్ లాంటి సుదూర దేశాలకు వెళ్లాల్సిన అవసరం   ఉండదని అమరావతే వాటిని తలదన్నేలా ఉంటుందని బాబా రాందేవ్ అన్నారు.  ఇక యోగా అనేది మన భారత ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు,  జీవన విధానంలో  అంతర్భాగమన్న బాబా రామ్‌దేవ్  ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.