బాబు కి ఊరట..!!

గత నెల 26న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీవీఛానళ్లు, సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తున్నారని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఆధార్‌కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని బాబు గోగినేనిపై వీరనారాయణ అనే వ్యక్తి మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాబు గోగినేనిపై దేశద్రోహం, ఆధార్‌చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

 

 

బాబు గోగినేనిపై కేసు నమోదు అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటీషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు పురోగతిపై ఈ నెల 25 తేదీలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.దీంతో పోలిసులు బాబు గోగినేనికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు.ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ 2 షోలో ఉండటంతో పోలీసులు బిగ్ బాస్ షో నిర్వాహకులకు నోటీసులు పంపాలనుకున్నారు. కానీ బాబుగోగినేని బిగ్‌బాస్‌షోలో ఉన్నందున విచారణకు హాజరుకాలేనంటూ హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై విచారణ జరిపిన కోర్టు కేసు దర్యాప్తును రెండు నెలల పాటు నిలిపివేయాలని ఆదేశించటంతో బాబుకి కాస్త ఊరట లభించింది. కోర్టు ఆదేశాలతో బిగ్‌బాస్‌ షోకు వెళ్లి బాబు గోగినేనికి నోటీసులు ఇవ్వాలనుకున్న పోలీసులు వెనక్కి తగ్గారు.దీంతో బాబుగోగినేని బిగ్‌బాస్‌షోలో కొనసాగనున్నారు.