బాబ్రీ కేసులో..కోర్టు ముందుకు అద్వానీ

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఇవాళ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకానున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతిలు నిందితులుగా ఉన్నారు. దీంతో వీరిపై సీబీఐ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దీంతో కోర్టు ముందు హాజరయ్యేందుకు అద్వానీ, జోషిలు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నో బయలుదేరి వెళ్లారు.