విజయసాయి ట్వీట్ కు సైకో ప్రిజనరి అంటూ అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్

టీడీపీ అధినేత చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ పై తీవ్ర విమర్శలతో కూడిన ట్వీట్లతో చెలరేగిపోతున్న ఎంపీ విజయ సాయి రెడ్డికి తాజాగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న విజయసాయి తాజా వ్యాఖ్యలపై స్పందిస్తూ అసలు దిగజారుడు ఇదే అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

ముందుగా ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్వీట్ లో ''జగన్ గారి ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తుంటే నిరసనలకు పిలుపునిచ్చాడు ఒక గుడ్డి విజనరీ. హైదరాబాద్లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం. ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం. ఇంకెంత దిగజారతావు బాబూ? దీంతో 2024లో నీ అడ్రస్ గల్లంతే'' అంటూ చంద్రబాబు పై విరుచుకు పడుతూ ట్వీట్ చేశారు.

ఐతే దీనికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు. "వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల అమ్మకం కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేసాడు సైకో ప్రిజనరీ అని అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేసారు. దీంతో పాటు.. సహజీవనం అన్న మేధావి ఇప్పుడు కరోనా కారణంగా ఇళ్ల పట్టాలు అమ్మకం వాయిదా పడింది అనడం అందరికి విడ్డూరంగా ఉంది. ఇళ్ల పట్టాలు అమ్మకం, డబుల్ రేటుకి స్థలాలు కొనడం. అధికార పార్టీ వాళ్లే తమది చెత్త పాలన అంటూ వేరే కుంపటి పెడుతున్నా ప్రిజనరీ దిగజారుతూనే ఉన్నాడు'' అంటూ ఎంపీ విజయసాయికి ట్విట్టర్ ద్వారా అయ్యన్నపాత్రుడు ఘాటుగా రిప్లై ఇచ్చారు.