మరో అవార్డ్ దక్కించుకున్న ఏపీ..
posted on Jan 17, 2018 10:37AM
ఆంధ్రప్రదేశ్ కు మరో అవార్డ్ దక్కింది. తాజాగా పసిఫిక్ ప్రాంత పర్యాటక రచయితల సంస్ధ ఆంధ్రప్రదేశ్ టూరిజంకు అవార్డు ప్రకటించింది. మార్చి తొ్మ్మిదో తేదీన బెర్లిన్ వేదికగా జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో... రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ విభజన అనంతరం ఎదురవుతున్న ఇబ్బందులను సైతం అధికమించి సమగ్ర అభివృద్దికి అవసరమైన ప్రణాళికలను అమలు చేస్తుండగా, దీనిని జాతీయ, అంతర్జాతీయ స్ధాయి సంస్ధలు గుర్తించటం ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడి నుండి తమకు లభిస్తున్న ప్రోత్సాహంతో ఈ విజయాలను సాధించగలుగుతున్నామని, ఈ క్రమంలో పర్యాటక శాఖ ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయమైనదని మీనా వివరించారు.