‘ఆటోనగర్ సూర్య’ తోక కట్!

posted on: Jun 28, 2014 11:26AM

‘మనం’ విజయంతో మాంఛి ఊపులో వున్న అక్కినేని నాగచైతన్య సినిమా ‘‘ఆటోనగర్ సూర్య' శుక్రవారం విడుదలైంది. ‘మనం’ సాధించిన విజయం ముందు ‘ఆటోనగర్ సూర్య’ సాధించిన ఫలితం తేలిపోయినట్టు వుందన్న అభిప్రాయాలు ప్రేక్షకులలో, ట్రేడ్ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సినిమా సెకండాఫ్‌‍లో అనవసర సన్నివేశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయ పడటంతో వెంటనే దర్శక నిర్మాతలు మేలుకుని నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సినిమా సెకండాఫ్‌లో ఎక్కువగా వుండటంతోపాటు అనవసరంగా భావించిన కొన్ని సీన్లు కట్ చేసి 12 నిమిషాల నిడివి తగ్గించారు. శనివారం నుంచి ట్రిమ్ చేసిన సినిమానే అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు దేవా కట్టా చెబుతూ, ‘‘ఈ సినిమా నిడివి ఎక్కువైందనే అభిప్రాయం వెలువడటంతో, ద్వితీయార్థంలో 12 నిమిషాలు ట్రిమ్ చేశాం. నిడివి తగ్గింది కాబట్టి, సినిమా స్పీడ్ పెరుగుతుంది. ట్రిమ్ చేసిన వెర్షన్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...