ఆస్ట్రేలియా ప్లేయర్లకు షాక్ ...

భారతదేశ పర్యటనలో వున్న ఆస్ట్రేలియా క్రికెట్ టీంకు ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. క్రికెట్ బోర్డు ఆదేశాలను పాటించనందుకు నలుగురు క్రికెటర్లపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వేటు వేసింది. వైస్ కెప్టెన్ వాట్సన్, బౌలర్లు ప్యాటిన్సన్, జాన్సన్, ఖాజాలను పంజాబ్ లో మొహాలిలో జరిగే ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్టు నుండి తప్పించింది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నా నాలుగు టేస్ట్ సీరిస్ ను భారత్ రెండు టెస్టు మ్యాచుల్లో నెగ్గి ఆధిక్యంలో ఉంది. మూడో టేస్ట్ నుండి నలుగురు ఆటగాళ్ళుపై వేటు పడడంతో మూడో టేస్ట్ రసకందాయంలో పడింది. బోర్డు ఆదేశాలను పాటించనందుకే వీరిపై వేటు పడిందని ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్  మికి ఆర్థర్ అంటున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే వైస్ కెప్టెన్ వాట్సన్ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం.