కేంద్ర మంత్రి జైశంకర్ పై దాడి యత్నం
Published on: Thu Mar 6, 2025 10:35AM
.webp)
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పై లండన్ లో దాడియత్నం జరిగింది. ఖలిస్థానీ వేర్పాటు వాదులు ఈ ప్రయత్నం చేశారు. జైశంకర్ అండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా పలు అధికారిక సమావేశాలలో పాల్గొన్న జైశంకర్ ఛాఠమ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు.
ఆ సమయంలో ఖలీస్థానీ వేర్పాటు వాదులు ఖలిస్థానీ జెండాలతో నిరసనకు దిగారు. నిరసనకారులలో ఒక వ్యక్తి జైశంకర్ కారుకు అతి సమీపంలోకి వచ్చి దాడికి యత్నించాడు. పోలీసులు వెంటనే అప్రమత్తం అవ్వడంతో దాడి యత్నం విఫలమైంది. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. అయితే జైశంకర్ కు అతి సమీంలోకి ఆ వ్యక్తి రావడం తీవ్ర భద్రతా వైఫల్యమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


