ఏటిఎం ఆగంతకుడి అరెస్ట్‌.?

 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏటీఎం వ్యవహారంలోని నిందితున్ని బెంగుళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్ట పగలు బెంగళూరులోని ఏటీఎం సెంటర్‌లో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన ఆగంతకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

తుముకూరు జిల్లా, టిపటూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి పేరు సతీష్ అని తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఇంకా పోలీసులు ధృవీకరించలేదు.  బెంగళూరులోని ఏటీఎంలో జ్యోతి ఉదయ్‌పై 19వ తేదీ ఉదయం దాడి జరిగింది. దాడిలో తీవ్ర గాయాల పాలయిన ఉదయ్‌ ప్రస్తుతం ఆమె బీజీఎస్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.