నేడే ఢిల్లీ సీఎంగా ఆతిషి ప్రమాణం!
Published on: Sat Sep 21, 2024 1:11PM

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి సింగ్ మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు రాజ్ నివాస్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఈ ఆరుగురి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అతిషితోపాటు ఆమె కేబినెట్లో గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరబ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేశ్ అహ్లావత్లతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై.. ఇటీవలే బెయిలుపై విడుదలైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.


