అస్సాంలో భారీ భూకంపం
Published on: Sun Sep 14, 2025 5:53PM

అస్సాంలో భూకంపనలు కలకలం రేపాయి. సోనిత్పుర్ జిల్లాలో రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతగా నమోదైంది. 5.కి.మీ లోతులో ఇది సంభవించిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు స్వల్పంగా ఊగినట్టు సమాచారం.
అయితే, ఇప్పటివరకు ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, చైనాలోనూ భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిసింది. అస్సాంలోని ఇదే ప్రాంతంలో వారం క్రితం 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రధాని మోదీ ప్రస్తుతం అస్సాం పర్యటనలోనే ఉన్న విషయం తెలిసిందే.


