బోగి మంటల్లో తెలంగాణ బిల్లు..!!

 

 

 

సంక్రాంతి సంధర్బంగా నిర్వహించనున్న బోగి మంటల్లో విభజన బిల్లును దహనం చేయాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17, 18 తేదీల్లో 48 గంటలపాటు రాష్ట్ర బంద్ నిర్వహించాలని ఏపీఎన్జీవోల జేఏసీ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నిర్ణయించాయి. ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఈ నెల 20న శాసనసభను ముట్టడించాలని నిర్ణయించారు. విభజన బిల్లును శాసనసభలో ఓడిస్తేనె పార్లమెంటులో అడ్డుకోనెందుకు వీలుటు౦దని తెలిపారు. ఈ వివరాలను సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వెల్లడించారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డిపై శాసనసభలో జరిగిన దాడి ఘటనను ఆయన ఖండించారు.