మరో సారి సమ్మెకు సిద్దమే..

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్ర వడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఏపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో శీతాకాల సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటు జరగదన్నారు. పార్లమెంట్‌ సమావేశాల మొదలవుతున్న సందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉదృతంగా ముందుకు తీసుకెళాతామన్నారు.

రాజ్యంగ ప్రక్రియను కాదని కేంద్ర ముందుకు వెలితే ఊరుకోమన్నారు అశోక్‌బాబు. సమైక్యా రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి మరో సారి సమ్మెకు కూడా సిద్దమన్న ఆయన, గతంలో తాము సమ్మె చేసినపుడు ఎలాంటి సహకారం అందించని రాష్ట్ర నాయకులపై మండిపడ్డారు. త్వరలోనే ఛలో ఢిల్లీ లేదా, ఛలొ హైదరాబాద్‌ కార్యక్రమం చేయటానికి సిద్దమవుతున్నట్టుగా ప్రకటించారు.