ఆశారాం బాపు అత్యాచారం కేసు.. దోషిగా తేల్చిన కోర్టు..

 

16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్టు  ఆశారాం బాపు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై జోధ్‌పూర్ కోర్టు నేడు తుది తీర్పు వెల్లడించింది. బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపును కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆశారాం బాపు సహా మరో ఐదుగురిని కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇదిలా ఉండగా.. ఈకేసు తీర్పు నేపథ్యంలో అల్లర్లు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజస్థాన్, గుజరాత్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు బాధిత బాలిక కుటుంబం ఇంటి వద్ద షహరాన్‌పూర్ జిల్లా యంత్రాంగం భారీగా బలగాలను మోహరించింది.