పేలుళ్లతో భయపెడుతున్నారు: ఎన్ఐఏ

 

అక్తర్, భత్కల్‌లను ఇటీవలే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం కోర్టుకు తెలిపింది. హైదరాబాదు - గోవా, హైదరాబాదు - బెంగళూరు జాతీయ రహదారులతో పాటు పలు ముఖ్య పట్టణాలలోను అక్తర్, భత్కల్‌ లు రెక్క నిర్వహించారని ఎన్ఐఏ తెలిపింది. పాకిస్తాన్ నుండి వచ్చే ఆదేశాల వల్ల భారత్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడుతూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడు అసదుల్లా అక్తర్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి 17వ తేది వరకు రిమాండు విధించింది. దాంతో అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు. దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్ ఐదవ నిందితుడిగా ఉన్నాడు.