కేజ్రీవాల్ కు అస్వస్థత
posted on Dec 30, 2013 2:27PM
ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన కేజ్రీవాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం కార్యాలయానికి హాజరుకాలేకపోయారు, ఆయన జ్వరంతో భాదపడుతున్నారు. ప్రతి ఇంటికి 700 లీటర్లు నీరు ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీ జల బోర్డు అధికారులతో ఆయన సమావేశమై ఈరోజు చర్చలు జరపాల్సివుంది. కేజ్రీవాల్ నివాసం నుంచే కొన్ని ముఖ్యమైన వాటిపై చర్చలు జరిపారు. ఆదివారం నుంచి తనకు 102 జ్వరం ఉందని ఆయన ఈరోజు ఉదయం ట్విటర్లో తెలిపారు. సోమవారం ఆఫీస్కు హాజరవడం చాలా ముఖ్యమని, నీటీ విషయంలో ప్రకటన చేయాలన్న ఆలోచనలో ఉన్నామని, దేవుడు నన్ను ఇదే సమయంలో అనారోగ్యవంతుణ్ణి చేశాడని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. డాక్టర్స్ తనకు రక్తపరీక్షలు నిర్వహించి, విశ్రాంతి అవసరమని సూచించారని ఆయన తెలిపారు.