ఏం తోచకపోతే అసెంబ్లీ పెడతారా..! గవర్నర్ పై సుప్రీం ఫైర్..

అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవా అసెంబ్లీ సమావేశాలపై తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. గవర్నర్ నిర్ణయం పై సుప్రీం కోర్టు కూడా ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గవర్నర్ జేపీ రాజ్‌ఖోవా ఈ ఏడాది జనవరి 14న జరుగాల్సిన సమావేశాలను గత డిసెంబర్ 16కు మారుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిని విచారించిన సుప్రీంకోర్టు  ముందస్తు తేదీ ప్రకారం సమావేశాలు జరిపితే ఏమి తేడా వచ్చేదని.. గవర్నర్‌కు ఏమీ తోచకపోతే సరదా కోసం సభను సమావేశ పరుస్తారా అని ప్రశ్నించారు. అనంతరం ఈకేసును సోమవారానికి వాయిదా వేశారు.