కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

 

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు సమస్య మరియు క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనను ఈ నెల 9న కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమించడంతో ఈరోజు మధ్యాహ్నం 12.08 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.