బాపు గారి అంత్యక్రియలు పూర్తి

 

ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు అంత్యక్రియలు చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశానవాటికలో పూర్తయ్యాయి. బాపు నివాసం నుంచి ప్రారంభమైన ఆయన అంతిమయాత్ర బీసెంట్ నగర్ శ్మశానవాటిక వరకు కొనసాగింది. ఈ అంతిమయాత్రలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రావికొండలరావు, బోనీ కపూర్, అనిల్ కపూర్ తదితర సినీ ప్రముఖులు, పలువురు అభిమానులు పాల్గొన్నారు. బాపును చివరి చూపు చూసుకోవడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. అలాగే సోమ, మంగళవాలలో తెలుగు సినిమా రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు బాపు భౌతిక కాయాన్ని సందర్శించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.