వక్ఫ్ సవరణ బిల్లుపై రగడ... పార్లమెంటు ఉభయ సభలు వాయిదా
Published on: Thu Feb 13, 2025 2:20PM
పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి.వక్ఫ్ సవరణ బిల్లుపై జెపిసీ ఇచ్చిన రిపోర్ట్ కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో రాజ్య సభలో గందరగోళం నెలకొంది. జగదాబికా పాల్ నేతృత్వంలోని జెపిసీ రిపోర్ట్ కు వ్యతిరేకంగా విపక్షాలు రాజ్య సభలో నిరసనకు దిగాయి. బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండా వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలో ప్రవేశ పెట్టడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి.జెపిసి రిపోర్ట్ కు విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఉభయ సభలో జెపిసి రిపోర్ట్ పై రగడ జరిగింది. ఉభయ సభలు వాయిదా పడ్డాయి.


