పంజాబ్ సీఎం కుర్చీపై కేజ్రీవాల్ క్లారిటీ...

 

పంజాబ్ సీఎం అభ్యర్ధిగా అరవింద్ కేజ్రీవాల్ బరిలో దిగుతారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలకు తెరదించారు కేజ్రీవాల్. ఈరోజు పటియాలలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 'నేను ఢిల్లీ సీఎంగానే కొనసాగుతాను.. పంజాబ్‌ నుంచే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తాం' అని కేజ్రీవాల్‌ వెల్లడించారు. కేజ్రీవాల్‌ను చూసి ఆప్‌కు ఓటు వేయాలని ఆ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా మంగళవారం ఓటర్లను అభ్యర్థించిన సంగతి తెలిసిందే.