ఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ సమ్మె

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయాలని నిర్ణయించారు. తాము దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి సమ్మె చేయబోతున్నామని కార్మికులు ప్రకటించారు. సమస్యల పరిష్కారం విషయంలో ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తాము సమ్మె నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఈనెల 8వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల చేత సమ్మెని విరమింపజేసేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు బుధవారం నాడు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపనున్నారు.