బస్సు రిజర్వేషన్లను నిలిపివేసిన ఏపీఎస్‌ ఆర్టీసీ

కరోనా వ్యాప్తి, నియంత్రణ నేపథ్యంలో ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశలుండటంతో బస్సు రిజర్వేషన్లను నిలిపివేసినట్టు ఏ పీ ఎస్ ఆర్టీసీ పేర్కొంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు నగదు వెనక్కి ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చాకే రిజర్వేషన్లు తిరిగి ప్రారంభిస్తామని ఆర్టీసీ తెలిపింది.