గ్రామ సచివాలయం పేపర్ లీకేజీ.. వారికే టాప్ ర్యాంకులు!!

 

ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామా సవచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షా పత్రాలు లీకయ్యాని వార్తలు వస్తున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి నిన్న ఫలితాలను విడుదల చేస్తూ ఇంత తక్కువ సమయం లో ఫలితాలను విడుదల చేసిన అధికారులను జగన్ అభినందించడం జరిగింది. ఐతే అసలు ఈ పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీసేలా ఆంధ్రజ్యోతి ఈ రోజు ఒక కథనం ప్రచురించింది. ఆ వార్త ప్రకారం ఈ పరీక్ష పేపర్లను సిద్ధం చేసిన ఏపీపీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి బంధువులే టాప్ ర్యాంకర్లుగా భారీ మార్కులు సాధించారని సదరు పత్రిక తన కథనంలో తెలిపింది. అనంతపురం జిల్లాకు చెందిన జి. అనితమ్మ అనే మహిళా కేటగిరి-1 విభాగంగంలో టాపర్ గా నిలిచిందని, అయితే ఆమె ఏపీపీఎస్సీ కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గా పనిచేస్తున్నారని అందులో పేర్కొంది.

అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖలో పనిచేసిన ఓ రిటైర్డు అధికారి చేతికి ఈ ప్రశ్నాపత్రం ముందుగానే వెళ్లిపోయినట్లు ఆ పత్రిక తెలిపింది. ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కుటుంబంలో ఏకంగా భార్య సహా ముగ్గురికి గ్రామసచివాలయం పరీక్షల్లో 3 ర్యాంకులు వచ్చాయని చెప్పింది. 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్ష చాలా కఠినంగా ఉందని పలువురు అభ్యర్థులు చెప్పారనీ అలాగే ఇందులో 100 మార్కులు దాటితే గ్రేటని, కానీ ఎవరు ఊహించని విదంగా ఫస్ట్ ర్యాంకర్ కు ఏకంగా 112.50 మార్కులు రావడంతో ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందన్న అనుమానాలు బలపడ్డాయని సదరు పత్రిక తన కథనంలో ప్రచురించింది.