TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్ఐటీ పాట్నాలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య

Published on: Sat Sep 21, 2024 11:16AM

పాట్నా ఎన్ఐటీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విద్యార్థిని శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కన్పించింది. మృతురాలి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. విద్యార్థిని మరణించడంతో తోటి విద్యార్థులు భారీ సంఖ్యలో క్యాంపస్ వెలుపల ఆందోళన చేపట్టారు. ఎన్ఐటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఇలాంటి ఆత్మహత్యలు ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్నాయి.