TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మరోసారి మోసపోయావ్ తెలుగోడా

Published on: Fri Apr 24, 2015 6:47PM



తెలుగువాడు మరోసారి మోసపోయాడు. ఆంధ్రప్రదేశ్‌కి మరోసారి అన్యాయం జరిగింది. ఇప్పటికే అన్యాయంతో, అవమానాలతో క్రుంగిపోయి వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద మరో పిడుగు పడింది.  కేంద్ర ప్రభుత్వం ఆ పిడుగును జాగ్రత్తగా తెలుగువాడి నడినెత్తిన పడేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా ఇక ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం నిర్మొహమాటంగా చెప్పేసింది. ఆనాడు రాష్ట్ర విభజన జరిగే సమయంలో దుష్ట కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కి ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామని మాయమాటలు చెప్పింది. ఆ విషయాన్ని విభజన చట్టంలో మాత్రం పొందుపరచలేదు. కాంగ్రెస్ ఐదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తానంటే... కాదు కాదు పదేళ్ళు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎంచక్కా చేతులు ఎత్తేసింది. ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పేసింది. ఆనాడు విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పార్లమెంట్‌లో ఎంతో కరుణ రసాత్మకంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ప్రస్తావన తెస్తేనే చిరాకు పడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అన్యాయాన్ని నిరసించాలి.. ఎదిరించాలి... మోసం చేసినవాళ్ళకి గుణపాఠం చెప్పాలి.