28 ఉద్యోగాలకు..13,535 దరఖాస్తులు

ఐదెంకెల జీతాలు వచ్చే ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నా..గవర్నమెంట్ జాబ్‌కు ఉన్న క్రేజే వేరు. తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో ఎస్సై, వేలిముద్రల విభాగం ఎఎస్సై పోస్టులకు వచ్చిన దరఖాస్తులే ఈ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో చెబుతోంది. ఈ రెండు డిపార్ట్‌మెంటుల్లో ఖాళీగా ఉన్న 28 పోస్టులకు ఆగస్టు 24వ తేదీని ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అభ్యర్ధుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నిన్న సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఆ సమయానికి మొత్తం 13,535 దరఖాస్తులందాయి. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 483 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. దరఖాస్తు దారుల్లో 12,357 మంది పురుషులు కాగా, 1178 మంది మహిళలు.