సీఎం కిరణ్ తో ఏపీ ఎన్జీవో నేతలు భేటి
posted on Oct 17, 2013 4:14PM
ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏపీ ఎన్జీవో ఉద్యోగ నేతలు సమావేశంమయ్యారు. చర్చల అనంతరం ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించేది, లేనిది మీడియా సమావేశంలో ప్రకటక చేయనున్నారు. గురువారం ఉదయం ఏపీఎన్జీవో భవన్లో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేతలు సమావేశయ్యారు. ఈ సందర్భంగా సీఎంతో మాట్లాడాల్సిన అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
ఆర్టికల్ 371 డిని ఏ విధంగా పరిష్కరిస్తారో సీఎం నుంచి హామీ తీసుకుంటామని అన్నారు. కిరణ్కుమార్రెడ్డి ఇచ్చే హామీలపై నిర్ణయం తీసుకునేందుకు 15 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు అశోక్బాబు తెలిపారు. ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయంఅందించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.