ఎవరికి ఓటు వెయ్యాలో చెబుతా: అశోక్‌బాబు

 

 

 

అధికారం కోసం అమ్ముడు పోయే పార్టీలకు బుద్ధి చెప్పాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వెయ్యాలో తామే చెబుతామని, ఆ బాధ్యత సీమాంధ్రులు తమకు ఇచ్చారన్నారు. సీమాంధ్రుల పోరాటాన్ని కొందరు నాయకత్వం లేని ఉద్యమంగా అభివర్ణిస్తున్నారని, ఇక్కడ ప్రజలే నాయకులని ఆయన స్పష్టం చేశారు. ఇంతకాలం సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధిష్ఠానానికి తొత్తులుగా మారిపోయారని అశోక్‌బాబు విమర్శించారు. రాజ్యాంగం తెలియని మంత్రులుండడం తమ దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. "మన ఉద్యమాన్ని మనమే కొనసాగిద్దాం. నేను, నాతో ఉన్న వారు అమ్ముడుపోయారని చాలా మంది మాట్లాడుతున్నారు. మేమంతా ఎవరికో అమ్ముడుపోలేదు. కేవలం సీమాంధ్ర జిల్లాల ప్రజాభిమానానికి అమ్ముడు పోయాం. ఈ సత్యాన్ని విభజనవాదులు గ్రహించాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.