ఏపీ మంత్రి కుటుంబంలో కరోనా కలకలం!

బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ కుటుంబంలో కరోనా కలకలం రేగింది. శంకరనారాయణ సోదరుడి కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకింది. దీంతో మంత్రి సోదరుడిని కలిసిన వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే అనంతపురం జిల్లా పెనుకొండలో 17 మంది వైసీపీ నేతలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు, మంత్రి ఇంటి వద్ద మున్సిపల్ సిబ్బంది బ్లీచింగ్, శానిటైజర్ పిచికారి చేశారు. 

ఇటీవల మంత్రి శంకరనారాయణ మేనత్త కన్నుమూశారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయగా.. మంత్రి సోదరుడితో సహా ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం మంత్రి, కుటుంబ సభ్యులకు ఓ పాఠశాలలోని క్వారంటైన్ సెంటర్లో ఉంచినట్లు తెలుస్తోంది. మంత్రి సోదరుడి కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ కావడంతో స్థానికుల్లో కూడా భయాందోళన నెలకొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామాల్లో బ్లీచింగ్, శానిటైజర్ పిచికారి చేయిస్తున్నారు.