పరిటాల కేసులో జగనే ముద్దాయి... సునీత

 

దివంగత తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య కేసును తిరగదోడితే వైసీపీ నాయకుడు జగన్ మొదటి ముద్దాయి అవుతారా? అవునని అంటున్నారు పరిటాల రవి భార్య, ఆంద్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తన భర్త, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసును తిరగదోడితే జగనే తొలి ముద్దాయి అవుతారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ ఆస్తుల కేసులో 11వ చార్జ్‌షీట్ దాఖలు చేసిన అంశంపై ఆమె వ్యాఖ్యానిస్తూ పరిటాల రవి కేసులో కూడా ఆయనే తొలి ముద్దాయి అవుతారని అంటున్నారు. పరిటాల రవి హత్య కేసును తిరగదోడాలని పరిటాల సునీత తరచూ అంటూ వుంటారు. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగానే పరిటాల హత్య కేసును తిరగదోడనున్నారా అనే సందేహాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.