తలసానిని సన్నాసి,దద్దమ్మ అన్నది కేసీఆరే


 

తెలంగాణ టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఏపీ మంత్రి జవహర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తలసాని అంత సన్నాసి, దద్దమ్మ లేడని కేసీఆరే గతంలో చెప్పారన్నారు. సమర్థులైన బీసీ నాయకులు ఏపీలో చాలా మంది ఉన్నారన్నారు. తెలంగాణలో దద్దమ్మలను వదిలేసి దమ్ముగల నాయకులం ఇక్కడకు వచ్చామని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులతో ఇక్కడి నేతలు ప్రజలకు అవాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల సహా 175 స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
బీజేపీ నేతలపై కూడా మంత్రి జవహర్ విమర్శలు చేశారు. కన్నా లక్ష్మినారాయణ  వైసీపీ అజెండాని బీజేపీ అజెండాగా మార్చుకుని  మాట్లాడుతున్నాడని మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. మాణిక్యాలరావు దొంగ దీక్షలు చేయడం కాదు, ధైర్యం ఉంటే ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్‌షాతో తేల్చుకోవాలని హితవు పలికారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో కేంద్రంలోని పెద్దలు తలోమాట చెబుతున్నారని అన్నారు. ఓ వైపు ప్రాజెక్టు పనులు  వేగంగా జరుగుతున్నాయని చెబుతున్న గడ్కరీ...నిధుల విడుదల విషయంలో చొరవ చూపడం లేదన్నారు. గడ్కరీ అబద్ధపు ప్రచారానికే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పూర్తిగా వివక్షకు గురైందన్నారు. చంద్రబాబు సమర్థుడైన నేత కాబట్టే పోలవరం, అమరావతి నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు.