ఏపీలో మంత్రి ఓటు గల్లంతు.. సామాన్యుల పరిస్థితి ఏంటి?

 

ఏపీలో సాక్షాత్తు మంత్రి ఫరూక్ ఓటు గల్లంతయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. తాజాగా కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. తనతో పాటు తన కుటుంబసభ్యులు, బంధువుల ఓట్లు తొలగించారని అన్నారు. నంద్యాలలో టీడీపీ సానుభూతిపరులైన మైనార్టీల ఓట్లను కూడా తొలగించారని మండిపడ్డారు. ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశానని చెప్పారు. ఎన్నికల్లో 8 సార్లు పోటీ చేసిన తన ఓటే గల్లంతైతే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనికంతా వైసీపీనే కారణమని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడానికి అక్రమ మార్గాలను ఎంచుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.