తొడ కొట్టడం కాదు.. నంద్యాలలో నాపై పోటీచేసి గెలువు
posted on Jan 17, 2019 1:39PM
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఏపీలో చంద్రబాబుకి వ్యతిరేకంగా, జగన్ కి మద్దతుగా వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అసదుద్దీన్ పై ఏపీ మంత్రి ఎంఎండీ ఫరూక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన అమరావతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సొంత సామ్రాజ్యంలో అసదుద్దీన్ తొడ కొట్టడం కాదని, నంద్యాలలో నాపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఏపీలో ప్రచారం చేయడం కాదని, సికింద్రాబాద్లో అసదుద్దీన్ పోటీ చేసి గెలవాలన్నారు. అసదుద్దీన్ బీజేపీ ఏజెంట్ అని ఆరోపించారు. దేశంలో మూడో ఫ్రంట్కు మనుగడలేదని, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ముడుపుల కోసమే జగన్, కేటీఆర్ భేటీ అయ్యారని మంత్రి ఫరూక్ విమర్శించారు.