TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

Published on: Tue Apr 7, 2026 2:34PM

 

మద్యం కుంభకోణం కేసులో  ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్టైన ఆయన దాదాపు ఏడాది కాలంగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పలు షరతులు విధిస్తూ ఉపశమనం కల్పించింది. ఈ నిర్ణయం కేసు తదుపరి దర్యాప్తు మరియు న్యాయపరమైన పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. పోలీసుల విచారణకు సహకరించాలని దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు స్పష్టం చేశారు. దాదాపు ఏడాదిగా ఆయన జైలులో ఉన్నారు. ఇదే కేసులోని పలువురు నిందితులకు ఇప్పటికే న్యాయస్థానం బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.