ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల

 

ఏపీలో ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. తొలిసారిగా ఇంటర్ ఫలితాలు గ్రేడింగ్ విధానంలో విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్‌ ఫస్టియర్ లో 60 శాతం, సెకండియర్ లో 72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో 72శాతంతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 81శాతం ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఉదయలక్ష్మి తెలిపారు. వీరిలో 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణలు కాగా.. 3.3 లక్షల మంది ఫెయిలయ్యారు. మే 14 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 24న చివరి తేదీ అని తెలిపారు.